1 విశ్రాంతి దినము గడచి పోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి.
2 వారు ఆదివారమున పెందలకడనే (లేచి బయలుదేరి) సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా.
3 సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో నొకరు చెప్పుకొనుచుండిరి
4 "వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి యుండుట చూచిరి, ఆ రాయి ఎంతో పెద్దది"
5 అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగీ ధరించుకొని యున్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండి యుండుట చూచి మిగుల కలవర పడిరి.
6 "అందుకతడు- కలవర పడకుడి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసును మీరు వెదకుచున్నారు ''ఆయన లేచియున్నాడు ఇక్కడ లేడు; వారు ఆయన ఉంచిన స్థలము చూడుడి."
7 మీరు వెళ్ళి ఆయన మీ కంటె ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోను పేతురుతోను చెప్పుడనెను
8 "వారు బయటకు వచ్చి, విస్మయమొంది వణకుచు సమాధియొద్ద నుండి పారిపోయిరి; వారు భయపడినందున ఎవనితో నేమియు చెప్పలేదు.(కొన్ని ముఖ్యమైన వ్రాత ప్రతులులో యీ సువార్త యిక్కడ ముగించబడెను)"
Women at Jesus\' Tomb 9 "అదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి, తాను ఏడు దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను"
10 ఆయనతో ఉండిన వారు దుఃఖపడి యేడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను
11 "గాని, ఆయన బ్రతికి యున్నాడనియు ఆమెకు కనబడెననియు వారు విని నమ్మకపోయిరి"
12 "ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడచి పోవుచుండగా, ఆయన మారురూపము గలవాడై వారికి ప్రత్యక్ష మాయెను."
13 "వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని, వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి."
14 "పిమ్మట పదునొకండు మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను"
15 మరియు ''మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి
16 "నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును"
17 "నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు."
18 "పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచి నప్పుడు వారు స్వస్థత నొందుదురు'' అని వారితో చెప్పెను."
19 ఇలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను.
20 "వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి, ప్రభువు వారికి సహాకారుడైయుండి, వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచు చుండెను. ఆమేన్." |