1 "ఆరు దినములైన తరువాత యేసు - పేతురును, యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి యెదుట రూపాంతరము పొందెను."
2 ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను.
3 ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాటలాడు చుండిరి.
4 "అప్పుడు పేతురు - ''ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది, నీ కిష్టమైతే ఇక్కడ నీకొకటి, మోషేకొకటి ఏలీయాకొకటి మూడు పర్ణశాలలను కట్టుదును' అని చెప్పెను."
5 "అతడు ఇంకను మాటలాడుచుండగా, ప్రకాశవంతమైన మేఘము వారిని కమ్మివేసెను. ఆ మేఘములో నుండి ''ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనానందించు చున్నాను. ఈయన మాట వినుడి'' అని ఒక శబ్దము మేఘమునుండి వినిపించెను."
6 శిష్యులు ఆ మాటలు విని మిక్కిలి భయపడి బోర్లపడగా
7 "యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, - ''లెండి, భయపడకుడి'' అని చెప్పెను."
8 వారు కన్నులెత్తి చూడగా అక్కడ యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు.
Jesus’ Transfiguration 9 "వారు కొండ దిగి వచ్చుచుండగా, యేసు వారితో - ''మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచువరకు ఈ దర్శనము గూర్చి మీరు ఎవరితోను చెప్పవద్దు'' అని వారి కాజ్ఞాపించెను."
10 "అప్పుడాయన శిష్యులు - ''ఇలాగైతే శాస్త్రులు ఏలీయా ముందు రావలెనని ఎందుకు చెప్పుచున్నార''ని ఆయన అడుగగా,"
11 "ఆయన - ''ఏలీయా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే. ఏలీయా ఇది వరకే వచ్చెను,"
12 వారతనిని ఎరుగక తమ కిష్టమువచ్చినట్లు ప్రవర్తించిరి. మనుష్య కుమారుడు కూడ ఆలాగే వారిచేత శ్రమలు పొందబోవుచున్నాడని మీతో చెప్పుచున్నాను'' అనెను.
13 అప్పుడాయన బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి.
14 వారు జనసమూహముల యొద్దకు వచ్చినప్పుడు ఒకడు యేసు నొద్దకు వచ్చి ఆయన యెదుట మోకరిల్లి -
15 "''ప్రభువా, నా కుమారుని కరుణింపుము; వాడు మూర్చ రోగియై మిక్కిలి బాధపడుచున్నాడు. తరుచుగా నిప్పులలోను నీళ్ళలోను పడుచున్నాడు."
16 నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చితిని గాని వారు వానిని స్వస్థపరచ లేకపోయిరని చెప్పెను.
17 "అందుకు యేసు - ''విశ్వాసము లేని మూర్ఖతరమువారలారా, మీతో నేనెంతకాలముందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నా యొద్దకు తీసుకొని రండి'' అని చెప్పెను."
18 అంతట యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదలిపోయెను. ఆ ఘడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను.
19 తరువాత శిష్యులు ఏకాంతముగా యేసు నొద్దకు వచ్చి మేము ఎందుచేత దానిని వెళ్ళగొట్ట లేకపోతిమని ఆయననడిగిరి.
20 అందుకాయన - ''మీ అల్ప విశ్వాసముచేతనే; మీకు ఆవగింజంత విశ్వాసమున్న యెడల ఈ కొండను చూచి
21 ఇక్కడ నుండి అక్కడకు పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియు నుండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' అని వారితో అనెను.
22 "వారు గలిలయలో సంచరించుచుండగా యేసు తన శిష్యులతో - ''మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడు,"
23 వారాయనను చంపుదురు; మూడవదినమున ఆయన తిరిగి లేచును'' అని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి.
24 "వారు కపెర్నహూమునకు వచ్చినపుడు అరషెకెలు అను పన్నును వసూలు చేయువారు పేతురు నొద్దకు వచ్చి - మీ బోధకుడు ఈ అరషెకెలు చెల్లించడా అని అడుగగా, చెల్లించునని చెప్పెను."
25 "అతడు యింటిలోనికి వచ్చి మాట్లాక ముందే యేసు ఆ సంగతి నెత్తి - ''సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు పన్నును సుంకమును ఎవరియొద్ద వసూలు చేసెదరు ? కుమారుల యొద్దనా? అన్యులనొద్దనా?'' అని అడుగగా, అన్యుల యొద్దనేయని అతడు చెప్పెను."
26 "అప్పుడు యేసు ''ఆలాగైతే కుమారులు స్వతంత్రులే,"
27 "అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని, దాని నోరు తెరచిన యెడల ఒక షెకెలు దొరకును; దానిని తీసుకొని నాకొరకును నీకొరకును వారికిమ్ము'' అని అతనితో చెప్పెను." |