1 "ఆయన తన శిష్యులతో ఇట్లనెను- ''అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కాని అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ."
2 "వాడు చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయుట కంటె, వాని మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయ బడుట వానికి మేలు."
3 మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన యెడల అతనిని గద్దించుము. అతడు మారుమనస్సు పొందినయెడల అతనిని క్షమించుము.
4 అతడు ఒక దినమున ఏడు మారులు నీ యెడల తప్పిదము జేసి ఏడు మారులు నీ వైపు తిరిగి మారుమనస్సు పొందితిననినయెడల అతనిని క్షమింపవలెను'' అనెను.
5 "అపొస్తలులు మా విశ్వాసమును వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా,"
6 ప్రభువు వారితో- ''మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్ళతో కూడ పెల్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును.
7 "దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైనను ఒక దాసుడుండగా, వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయుమని వానితో చెప్పునా ? చెప్పడు."
8 "అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరచి, నడుము కట్టుకొని నేను అన్నపాన ములు పుచ్చుకొను వరకు నాకు పరిచారము చేయుము. అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును, గాని"
9 ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయపడెనని వాడిని మెచ్చునా?
10 "అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాత, మేము నిష్ప్రయోజకులమైన దాసులము. మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడి'' అనెను."
11 ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవుచు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను.
12 "ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా పది మంది కుష్టరోగులు ఆయనకు యెదురుగా వచ్చి, దూరమున నిలిచి-"
13 ''యేసుప్రభువా మమ్మును కరుణించుము'' అని కేకలు వేసిరి.
14 ఆయన వారిని చూచి ''మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరచు కొనుడి'' అని వారితో చెప్పెను. వారు వెళ్ళు చుండగా శుద్ధులైరి.
15 వారిలో నొకడు తనకు స్వస్థత కలుగుట చూచి
16 "గొప్ప శబ్ధముతో దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపెను. వాడు సమరయుడు"
17 అందుకు యేసు - ''పది మంది శుద్ధులైరి కారా? ఆ తొమ్మిది మంది ఎక్కడా ?
18 ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చినవాడెవడును అగపడలేదా'' అని చెప్పి
19 "''నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను'' అని వానితో చెప్పెను."
20 "దేవుని రాజ్యమెప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన నడిగినప్పుడు, ఆయన- ''దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు."
21 "ఎందుకనగా, ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే యున్నది గనుక ఇదిగో ఇక్కడ అదిగో అక్కడ అని చెప్పవీలు పడదు'' అని వారికి ఉత్తరమిచ్చెను."
22 మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను - ''మనుష్యకుమారుని దినములలో ఒక దినము చూడవలెనని మీరు కోరుదినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు.
23 "వారు ఇదిగో ఇక్కడనని, అదిగో అక్కడనని మీతో చెప్పిన యెడల వెళ్ళకుడి, వెంబడింపకుడి."
24 ఆకాశము క్రింద ఒక దిక్కునుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరియొక దిక్కున కేలాగు ప్రకాశించునో ఆలాగున మనుష్యకుమారుడు తన దినమున ఉండును.
25 అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షించబడవలెను
26 నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములోను జరుగును
27 "నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళికీయబడుచు నుండిరి, అంతలో జల ప్రళయము వచ్చి వారినందరిని నాశనము చేసెను."
28 "లోతు దినములలో జరిగినట్టును జరుగును; జనులు తినుచు త్రాగుచు, కొనుచు అమ్ముచు నారు నాటుచు యిండ్లు కట్టుచు నుండిరి."
29 అయితే లోతు సొదమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకము కురిసి వారినందరిని నాశనము చేసెను.
30 ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును.
31 "ఆ దినమున మిద్దె మీద నుండు వాడు యింట నుండు తన సామగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు, ఆలాగే పొలములలో నుండు వాడును తిరిగి రాకూడదు."
32 లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి;
33 "తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టు కొనును, దాని పోగొట్టు కొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనును."
34 ఆ రాత్రి యిద్దరొక మంచము మీద నుందురు. వారిలో ఒకరు కొని పోబడును. ఒకరు విడిచి పెట్టబడును.
35 "ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగలి విసరు చుందురు, ఒకతె కొనిపోబడును, ఒకతె విడిచి పెట్టబడును."
36 "ఇద్దరు మనుష్యులు పొలములో ఉందురు- ఒకడు కొనిపోబడును, ఒకడు విడిచి పెట్టబడును'' అనెను"
37 "శిష్యులు - ప్రభువా, ఇది ఎక్కడజరుగునని ఆయన నడిగినందుకు, ఆయన- ''పీనుగు ఎక్కడ వుండునో అక్కడ గ్రద్దలును పోగవును'' అని వారితో చెప్పెను." |